GOOD NEWS: తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పథకాల్లో ఒకటిగా ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా.. రూ.30,000 ఏటా అందుతాయి. 55 ఏళ్ల లోపు, పింఛను పొందని తెల్ల రేషన్ కార్డు మహిళలు అర్హులుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. రైతు భరోసా నిధులు కూడా కొద్ది రోజుల్లో జమ అవుతాయి. ఈ నిర్ణయాలు ఎన్నికల ముందు విశ్వాసాన్ని పెంపొందించి.. హామీల అమలుకు ప్రాధాన్యతను సూచిస్తున్నాయి.
మహాలక్ష్మి పథకం విస్తరణ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ఆరు గ్యారెంటీలను అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ( 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్) వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభమై.. పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు కూాడా అందాయి. ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు రూ.2,500 అందించే పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.30,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ముమ్మరంగా రూపొందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com