తెలంగాణలో వర్సిటీలకు వీసీలను ప్రకటించిన ప్రభుత్వం..!

తెలంగాణలో వర్సిటీలకు వీసీలను ప్రకటించిన ప్రభుత్వం..!
తెలంగాణలో పది యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం వీసీలను ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ రవీందర్ ను నియమించింది.

తెలంగాణలో పది యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం వీసీలను ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ను నియమించింది. కాకతీయ యూనివర్సిటీకి వీసీగా టీ. రమేష్, అంబేద్కర్ యూనివర్సిటీకి వీసీగా కిషన్ రావు, శాతవాహన యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ మల్లేశం, తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా రవీందర్ గుప్తా, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, పాలమూరు యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, JNTU యూనివర్సిటీకి వీసీగా కట్ట నరసింహరెడ్డిని ప్రకటించింది. కాగా ఈ 10మంది వీసీల నియామకానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.


Tags

Read MoreRead Less
Next Story