Tamilisai Soundararajan: ప్రోటోకాల్ ఇబ్బందిపై స్పందించిన గవర్నర్ తమిళిసై..
By - Divya Reddy |13 April 2022 4:00 AM GMT
Tamilisai Soundararajan: ప్రోటోకాల్ కంటే ప్రజల ఆత్మీయ స్వాగతమే ఎంతో ఆనందంగా ఉందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.
Tamilisai Soundararajan: ప్రొటోకాల్ కంటే ప్రజల ఆత్మీయ స్వాగతమే ఎంతో ఆనందంగా ఉందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని వీక్షించిన తరువాత.. ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. గిరిజన గ్రామాల్లో గర్భిణీలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో గిరిజనులు, ప్రజా సమస్యలపై రాజ్భవన్ దృష్టిపెడుతుందన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను తప్పకుండా పరిశీలిస్తామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com