Green India Challenge: నేను సైతం అంటోన్న విలన్...
hyderabad

X
By - Subba Reddy |4 Jan 2023 3:15 PM IST
'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో పాల్గొడం చాలా ఆనందంగా ఉందంటోన్న సముద్రఖని; ఇదొక బృహత్తర కార్యక్రమమని ప్రశంసలు
తెలంగాణలో మొదలై దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో రాజకీయ నాయకులే కాదు సినీ తారలు, సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. తాజాగా డైరెక్టర్ శశికుమార్ ఈ ఛాలెంజ్ను విసరడంతో విలక్షణ నటుడు సముద్రఖని దాన్ని స్వీకరించారు.
బుధవారం హైటెక్ సిటీలోని శిల్పారామంలో సముద్రఖని రావి మెక్కను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తప్పక పాల్గొనాలని చెప్పారు. అనంతరం ఈ ఛాలెంజ్ను మరింత ముందుకు తీసుకుపోవడానికి తన కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ, ప్రముఖ దర్శకుడు హెచ్.వినోత్ లకు 'గ్రీన్ ఇండియా చాలెంజ్'ను విసిరాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com