కాంగ్రెస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగిన హరీష్రావు

X
By - Vijayanand |27 May 2023 5:24 PM IST
కాంగ్రెస్, బీజేపీ నేతలు రాష్ట్రం పరువు తీస్తున్నారని.. ఉద్యమంలో కలిసి రాలేదు.. అభివృద్ధిలో కలిసి రావడం లేదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి హరీష్రావు ఫైరయ్యారు. పాలమూరు జిల్లా జడ్చర్లలో పర్యటించిన ఆయన.. వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నేతలపై హరీష్రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రాష్ట్రం పరువు తీస్తున్నారని.. ఉద్యమంలో కలిసి రాలేదు.. అభివృద్ధిలో కలిసి రావడం లేదన్నారు. కొడంగల్కు రేవంత్ ఒక్క ఆస్పత్రి తెచ్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తూ.. తెలంగాణ ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రుల నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతోందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com