Harish Rao : దేశంలో ఎక్కువ ఆసరా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమే : హరీష్ రావు
By - Sai Gnan |11 Oct 2022 11:45 AM GMT
Harish Rao : దేశంలో ఎక్కువ ఆసరా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణయేనన్నారు మంత్రి హరీష్ రావు
Harish Rao : దేశంలో ఎక్కువ ఆసరా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణయేనన్నారు మంత్రి హరీష్ రావు. 10 వేల మందికి ఆసరా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. అందులో 5 వేల మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసిందన్నారు. మరో 10 వేల మంది రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు.
ఏడాదికి వంద కోట్ల రూపాయలను కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఇక తెలంగాణ రాకముందు కేవలం మూడు డయాలసిస్ ఆస్పత్రులు మాత్రమే ఉండేవని.. రాష్ట్రం ఏర్పడ్డాక 83 చోట్ల డయాలసిస్ ఆస్పత్రులు ప్రారంభించుకున్నామన్నారు మంత్రి హరీష్ రావు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com