Hath Se Hath Jodo : 8వ రోజు కొనసాగుతున్న రేవంత్ యాత్ర

X
By - Vijayanand |14 Feb 2023 1:05 PM IST
సాయంత్రం 6 గంటలకు స్థానిక అంబేద్కర్ కూడలిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరగనుంది
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8వ రోజు కొనసాగుతుంది.భద్రాచలం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. రేవంత్ పాదయాత్రలో నాయకులు, కార్యకర్తులు భారీగా పాల్గొన్నారు. ఇవాళ పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు పాల్గొనున్నారు. సాయంత్రం 6 గంటలకు స్థానిక అంబేద్కర్ కూడలిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరగనుంది. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వివిధ వర్గాల వారు రేవంత్రెడ్డికి వినతి పత్రాలు అందిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com