నాన్నా ఎందుకిలా చేశావు.. అమ్మ మమ్మల్ని ఏం చేసిందో చూడు..

నాన్నా ఎందుకిలా చేశావు.. అమ్మ మమ్మల్ని ఏం చేసిందో చూడు..
భర్త చేసిన పనికి.. భార్య ఇద్దరు చిన్నారులతో పాటు.. తానూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

అని ప్రశ్నిస్తున్నట్టే అనిపించింది అతడికి.. చిన్నారుల జీవితాన్ని చిదమేసి తాను కూడా ఉరివేసుకున్న భార్యని, పిల్లలని చూసి భోరున విలపించాడు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంకు చెందిన శ్రీనాథ్. ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనాథ్‌‌కి భార్య మౌనిక, మూడేళ్ల పాప లాక్షిత, ఏడాదిలోపు బాబు ఉన్నారు. ఆనందంగా సాగిపోతున్న సంసారంలో అతడి వివాహేతర సంబంధం చిచ్చురేపింది. దీంతో దంపతులిరువురి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వీరి గొడవలకు సంబంధించి సూర్యాపేటలో పంచాయితీకి రావాలని శ్రీనాథ్‌కు బంధువులు కబురు చేశారు. అయితే ఆ పంచాయితీకి వెళ్లొద్దని, వెళితే తాను, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటామని మౌనిక అన్నది. అయినా వినకుండా శుక్ర, శనివారాలు పంచాయితీకి వెళ్లాడని తెలిసి ఆదివారం మరోసారి భర్తను నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం భర్త బయటకు వెళ్లడంతో.. మనస్థాపానికి గురైన మౌనిక ఇంట్లోని ఆర్చీకి రెండు వైపులా పిల్లలకు కండువాతో ఉరేసింది.

తర్వాత తానూ ఇద్దరి చిన్నారుల నడుమ చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనాథ్.. ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి చూశారు. భార్య, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా వేలాడుతుండటాన్ని చూసి బావురుమన్నాడు. తల్లి క్షణికావేశంతో ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిందని స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :

కోవిడ్ కొత్త రూపు 'లాంబ్డా' వేరియంట్.. దాని లక్షణాలు..

ఈ ముగ్గురు అక్కాచెల్లెల్లతో ఆడిపాడిన ఏకైక హీరో..!

ఇమ్మానుయేల్ కి వేరే అమ్మాయితో పెళ్లి .. లైవ్‌లో కంటతడి పెట్టుకున్న వర్ష..!

ఇదేం మోసం రా బాబు.. భార్యని చెల్లి అని చెప్పి..


Tags

Read MoreRead Less
Next Story