HYD: జీసీసీలకు హైదరాబాద్‌, బెంగళూరులే అడ్డా

HYD: జీసీసీలకు హైదరాబాద్‌, బెంగళూరులే అడ్డా
X
దేశంలో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లప్రధాన కేంద్రాలుగా హైదరాబాద్‌, బెంగళూరు

భారతదేశంలో గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ల (GCC) ప్రధాన కేంద్రాలుగా హైదరాబాద్‌, బెంగళూరు ఆధిపత్యం కొనసాగుతోంది. దేశంలోని ప్రతి 10 జీసీసీల్లో 7 కేంద్రాల నాయకత్వం ఈ రెండు నగరాలపైనే ఆధారపడి ఉందని క్వెస్‌ కార్ప్‌ విడుదల చేసిన ‘India’s GCC–IT Talent Trends 2025’ నివేదిక వెల్లడించింది. నూతన జీసీసీల కోసం ఉద్యోగ నియామకాలు, సేవలు, టాలెంట్‌ అవసరాల పరంగా హైదరాబాద్‌ అత్యంత వేగంగా ఎదుగుతోందని నివేదిక తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 42% అధిక డిమాండ్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. టాలెంట్‌ ప్రీమియం 6–8% వరకు పెరిగి, కంపెనీలను ఆకర్షిస్తున్నది. బెంగళూరు ఇప్పటికీ టాప్‌ టెక్‌ టాలెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. డిమాండ్‌ అధికం కారణంగా ఇక్కడ ఖర్చు 8–10% వరకు మార్కెట్‌ సగటును మించి ఉందని నివేదిక చెబుతోంది. చెన్నై ఫైనాన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, కంట్రోల్‌–ఓరియెంటెడ్‌ జీసీసీ ఆపరేషన్లకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోంది. 94% రిటెన్షన్‌ రేటుతో చెన్నై దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ నిలుపుదల సాధించింది. అనలిటిక్స్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌ రంగాల్లో పుణె బలపడుతుండగా, 2వ శ్రేణి నగరాల్లో కొచ్చి, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్‌, ఇండోర్‌ వేగంగా గుర్తింపు పొందుతున్నాయి. క్వెస్‌ కార్ప్‌ విడుదల చేసిన మరో నివేదిక ‘India New GCC Talent Trends 2025’ ప్రకారం, ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో నైపుణ్య లోటు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తేలింది.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌

స్థి­రా­స్తి కన్స­ల్టెం­ట్‌ ప్రా­ప్‌­టై­గ­ర్‌ (PropEquity) వి­డు­దల చే­సిన ని­వే­దిక ప్ర­కా­రం, ప్ర­స్తుత ఆర్థిక సం­వ­త్స­రం జులై-సె­ప్టెం­బ­రు త్రై­మా­సి­కం­లో హై­ద­రా­బా­ద్‌ నగ­రం­లో ఇళ్లు/ఫ్లా­ట్ల ధరలు 13% మేర పె­రి­గా­యి. గతే­డా­ది ఇదే త్రై­మా­సి­కం­లో చద­ర­పు అడు­గు­కు సగటు ధర రూ.6,858 ఉం­డ­గా, ఈసా­రి అది రూ.7,750కి చే­రు­కుం­ది. వి­లా­స­వం­త­మైన ఇళ్లు, ఫ్లా­ట్ల­కు గి­రా­కీ పె­ర­గ­డం వల్లే ఈ ధరల పె­రు­గు­దల కని­పిం­చి­న­ట్లు సం­స్థ తె­లి­పిం­ది. హై­ద­రా­బా­ద్‌­తో సహా దే­శం­లో­ని 8 ప్ర­ధాన నగ­రా­ల్లో ఇళ్ల సగటు ధరలు 7% నుం­చి 19% వరకు వృ­ద్ధి­ని నమో­దు చే­శా­య­ని ప్రా­ప్‌­టై­గ­ర్‌ వె­ల్ల­డిం­చిం­ది.

Tags

Next Story