Hyderabad: నుమాయిష్ ఆఫర్‌... నేడు మహిళలకు మాత్రమే

Hyderabad: నుమాయిష్ ఆఫర్‌... నేడు మహిళలకు మాత్రమే
ప్రారంభమైన నుమాయిష్‌ సందడి; నేడు ప్రత్యేకించి మహిళలకు మాత్రమే ఆఫర్‌

హైదరాబాద్‌ లోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సందడి షురూ అయ్యింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన 2400 స్టాల్స్‌ ను ఏర్పాటు చేస్తారు. ఈ 46 రోజులపాటు జరుగనున్న ఈ ఎగ్జిబిషన్‌లోని షాపింగ్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


ఇక ప్రతి సంవత్సవరం మాదిరిగానే 46రోజుల పాటు జరుగునున్న ఈ వేడుకలో నేడు మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ ఉపాధ్య‌క్షుడు ఆశ్విన్ మార్గం తెలిపారు. ప్ర‌తి సంవ‌త్స‌రం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఒక రోజు మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా ప్రవేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటలా 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటలా 30 నిమిషాల వరకు ఓపెన్ చేసే ఉంటుంది.

మరోవైపు ఈ ఫేమస్‌ ఎగ్జిబిషన్‌ కు ఈసారి దాదాపు 25 లక్షలమంది వస్తారని ఎగ్జిబిష‌న్ సొసైటీ వారు అంచనా వేయగా, వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు కూడా ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్‌ సిబ్బంది తెలియజేస్తున్నారు. ఇక ఈ ఎగ్జిబిషన్‌ ఎంట్రీ టికెట్టు రూ. 40 లతో ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు.

Tags

Read MoreRead Less
Next Story