Hyderabad: ప్రేమ జంట మిస్సింగ్ కేసు విషాదాంతం

Hyderabad: ప్రేమ జంట మిస్సింగ్ కేసు విషాదాంతం
ఇంటి నుంచి వెళ్లిపోయిన కల్పన, ఖలీల్ మృతదేహాలు నార్సింగి చెరువులో లభ్యం...

మెదక్ జిల్లా ప్రేమ జంట మిస్సింగ్ కేసు విషాదాంతం అయింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన కల్పన, ఖలీల్ మృతదేహాలు నార్సింగి చెరువులు లభ్యం అయ్యాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. ఇక రెండు నెలల క్రితం కల్పనను మరో వ్యక్తి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ నేపథ్యంలోని అత్తింటి నుంచి స్వగ్రామానికి వచ్చిన కల్పన ఖలీల్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుతో చేయడంతో విచారణ చేపట్టారు. నార్సింగి చెరువు వద్ద ఖలీల్ బైకును గుర్తించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story