Hyderabad: పాత మంచం ఇచ్చారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు

X
By - Subba Reddy |20 Feb 2023 12:00 PM IST
పాత ఫర్నిచర్ ఇచ్చారంటూ అత్తింటివారిపై కోపం పెంచుకున్న పెళ్లి కొడుకు నిఖా సమయానికి డుమ్మా కొట్టాడు
అత్తింటివారు పాత ఫర్నిచర్ ఇచ్చారంటూ ఏకంగా పెళ్లికి డుమ్మాకొట్టాడు పెళ్లికొడుకు. ఈ ఘటన హైదరాబాద్లోని బండ్లగూడలో జరిగింది. స్కూలు బస్సు డ్రైవర్గా పనిచేసే మౌలాలికి చెందిన మహ్మద్ జకారియాకు బండ్లగూడ రహమత్ కాలనీకి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. నిన్న నిఖా జరగాలి. సంప్రదాయం ప్రకారం వధువు తండ్రి శనివారమే మంచం, ఇతర ఫర్నిచర్ వరుడి ఇంటికి పంపారు. అయితే పాత ఫర్నిచర్ ఇచ్చారంటూ అత్తింటివారిపై కోపం పెంచుకున్న పెళ్లి కొడుకు నిఖా సమయానికి డుమ్మా కొట్టాడు. దీంతో వధువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లారు. పాత ఫర్నిచర్ ఎందుకు ఇచ్చావంటూ గొడవపడ్డారు. దీంతో వధువు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com