Hyderabad: కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందటం బాధాకరం : గవర్నర్ తమిళిసై

Hyderabad: కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందటం బాధాకరం : గవర్నర్ తమిళిసై
ప్రస్తుత ఏర్పాట్లు సరిపోవడం లేదని తాజా ఘటన రుజువు చేస్తోందని పేర్కొన్నారు గవర్నర్‌

వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై స్పందించారు. ఈ విషాద ఘటనతో బాధపడ్డానంటూ తమిళి సై ట్వీట్ చేశారు. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటివి జరగకుండా చూడటానికి… ప్రస్తుత ఏర్పాట్లు సరిపోవడం లేదని తాజా ఘటన రుజువు చేస్తోందని పేర్కొన్నారు గవర్నర్‌ .

మంగళవారం ఓ నాలుగేళ్ల బాలుగిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. పరిస్థితిని గమనించిన యంత్రాంగం.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన మరుసటిరోజే మరో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన చైతన్య పురి మారుతీ నగర్‌లో బుధవారం జరిగింది. బాలుడికి స్వల్పగాయాలు కావడంతో తల్లిదండ్రులు సకాలంలో స్పందించి హాస్పిటల్ కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story