Hyderabad: ట్రాఫిక్ చలాన్ లు కట్టలేక వ్యక్తి ఆత్మహత్య

Hyderabad: ట్రాఫిక్ చలాన్ లు కట్టలేక వ్యక్తి ఆత్మహత్య
ట్రాఫిక్ చలాన్లు కట్టకపోవడంతో వ్యక్తి బైక్ ను సీజ్ చేసిన కానిస్టేబుల్; మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఎల్లయ్య

ట్రాఫిక్ చలాన్ కట్టలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చింతల్ బస్తీలోని నీలం రాజశేఖర రెడ్డి ప్రాంతానికి చెందిన ఎల్లయ్య (52) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య స్థానికంగా సాయబాబా ఆలయంలో హెల్పర్ గా పనిచేస్తోంది. అయితే ఎల్లయ్యకు ఓ బైక్ ఉండగా దానిపై పలు ట్రాఫిక్ చలాన్లు బాకీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం మీర్ చౌక్ కు చెందిన ట్రాఫిక్ పోలీసులు ఎల్లయ్య బండిని స్వాధీనం చేసుకున్నారు. రూ. పది వేలు చెల్లించి బండిని విడిపించుకోవాల్సిందిగా చెప్పారు. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఎల్లయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందే సూసైడ్ నోట్ రాసిన ఎల్లయ్య తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ఆయన కుమారుడు కేటీఆర్ ను ఉద్దేశిస్తూ పేదవారి నడ్డి విరుస్తోన్న ట్రాఫిక్ చలాన్ల గురించి కాస్త ఆలోచించాలని పేర్కొన్నాడు.


Tags

Read MoreRead Less
Next Story