Hyderabad: బాలానగర్ లో రెచ్చిపోయిన వీధికుక్క

Hyderabad: బాలానగర్ లో రెచ్చిపోయిన వీధికుక్క
16మంది పై దాడి చేసిన వీధి కుక్క; గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు
నగరంలో ఎటు చూసినా వీధుకుక్కల స్వైర్విహారం కనిపిస్తూనే ఉంది. ఎక్కడికక్కడ శునకాల దాడిలో ప్రజలు గాయపడుతూనే ఉన్నారు. తాజాగా బాలానగర్ లో ఓ వీధికుక్క ఏకంగా 16 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. వీరిలో 8మంది చిన్నారులే కావడం ఆందోళన కలిగించే అంశం. వీరిలో నలుగులు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రోడ్డు పక్కగా నడుస్తున్నా వారిపైకి ఒక్కసారిగా దూసుకువచ్చిన శునకం ఒకరి వెంబడి ఒకరిపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకు జీహెచ్ఎంసీ అధికారులు రెండ గంటల పాటూ శ్రమించి శునకాన్ని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story