Hyderabad : బస్తీవాడ అక్రమ నిర్మాణాలపై GHMC ఉక్కుపాదం
By - Vijayanand |14 Feb 2023 7:18 AM GMT
ఉన్న పళంగా వెళ్లిపోవాలని అధికారులు చెప్పడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ మసాబ్ ట్యాంక్లోని టెన్షన్ వాతావరణం నెలకొంది. మసాబ్ ట్యాంక్లోని బస్తీవాడలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏసీ గార్డ్లో వెలిసిన అక్రమ నిర్మాణాల్లో ఉన్న బస్తీవాడ వాసులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఉన్న పళంగా వెళ్లిపోవాలని అధికారులు చెప్పడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్తీలోకి అధికారులను రానీయకుండా స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించి.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com