HYDRA: రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా

HYDRA: రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
X
హైకోర్టు తీర్పుతో రంగంలోకి దిగిన హైడ్రా... కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 36 ఎకరాల భూమిని రక్షించిన హైడ్రా.. రూ.3,600 ఎకరాల భూమిని హైడ్రా రక్షణ

భా­గ్య­న­గ­రం­లో హై­డ్రా అధి­కా­రుల కూ­ల్చి­వే­త­లు కొ­న­సా­గు­తు­న్నా­యి. వరు­స­గా అక్రమ ని­ర్మా­ణా­ల­పై హై­డ్రా అధి­కా­రు­లు ఉక్కు­పా­దం మో­పు­తు­న్నా­రు. శని­వా­రం కొం­డా­పూ­ర్‌­లో హై­డ్రా అధి­కా­రు­లు కూ­ల్చి­వే­త­లు చే­ప­ట్టా­రు. కొం­డా­పూ­ర్‌­లో­ని బి­క్ష­ప­తి నగ­ర్‌­లో అక్రమ ని­ర్మా­ణా­ల­ను కూ­ల్చి­వే­స్తు­న్నా­రు. ప్ర­భు­త్వ స్థ­లం­లో అక్రమ ని­ర్మా­ణా­ల­ను తొ­ల­గి­స్తు­న్నా­రు హై­డ్రా సి­బ్బం­ది. భారీ పో­లీ­స్ బం­దో­బ­స్తు నడుమ కూ­ల్చి­వే­త­లు చే­ప­ట్టా­రు. కూ­ల్చి­వే­తల వద్ద­కు మీ­డి­యా­ని పో­లీ­సు­లు అను­మ­తిం­చం లేదు. రెం­డు కి­లో­మీ­ట­ర్ల దూ­రం­లో­నే మీ­డి­యా­ను, స్థా­ని­కు­ల­ను పో­లీ­సు­లు అడ్డు­కుం­టు­న్నా­రు.

ఆపరేషన్‌ కొండాపూర్‌

ఆర్టీఏ కా­ర్యా­ల­యం పక్క­నే ఉన్న భి­క్ష­ప­తి నగర్ ఏరి­యా­లో ఆప­రే­ష­న్‌ కొం­డా­పూ­ర్‌ హై­డ్రా చే­ప­ట్టిం­ది. సర్వే నం­బ­ర్ 59లో ఉన్న ఈ 36 ఎక­రాల ప్ర­భు­త్వ స్థ­లం­లో కొం­త­మం­ది వ్య­క్తు­లు ఆక్ర­మిం­చా­రు. తా­త్కా­లిక ని­ర్మా­ణా­లు చే­ప­ట్టా­రు. వ్యా­పార కా­ర్య­క­లా­పా­లు చే­ప­ట్టా­రు. దీ­ని­పై హై­డ్రా­కు అనేక ఫి­ర్యా­దు­లు వచ్చా­రు. ఈ ఫి­ర్యా­దు­ల­తో కద­లిన అధి­కా­రు­లు చర్య­ల­కు ఉప­క్ర­మింం­చా­రు. పక­డ్బం­దీ­గా ఆక్ర­మ­ణ­లు తొ­ల­గిం­చా­రు. దీ­ని­పై హై­కో­ర్టు­లో కేసు నడు­స్తోం­ది. అయి­తే ఈ వి­చా­ర­ణ­లో భా­గం­గా ఆక్ర­మ­ణ­లు తొ­ల­గిం­చా­ల­ని అధి­కా­రు­ల­ను హై­కో­ర్టు ఆదే­శిం­చిం­ది. హై­కో­ర్టు ఆదే­శాల మే­ర­కు హై­డ్రా సి­బ్బం­ది ఈ ఆక్ర­మ­ణల తొ­ల­గిం­పు­ను అత్యంత పక­డ్బం­దీ­గా చే­ప­ట్టా­రు. ఎలాం­టి అవాం­ఛ­నీయ ఘట­న­లు జర­గ­కుం­డా ఉం­డేం­దు­కు, ఆ ప్రాం­తం­లో భారీ పో­లీ­సు బం­దో­బ­స్తు ఏర్పా­టు చే­శా­రు.


పూర్తి బందోబస్తుతో ఆపరేషన్

పూర్తి బందోబస్తుతో ఆపరేషన్ చేపట్టిన హైడ్రా అధికారులు ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో కారిడార్లు ఏర్పాటు చేశారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించారు. అది ప్రభుత్వ భూమి అని చెప్పే బోర్డులు ఏర్పాటు చేశారు. చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. కొండాపూర్ ప్రాంతం హైదరాబాద్‌ నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత విలువైన స్థిరాస్తి మార్కెట్‌లలో ఒకటి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్‌ 59లోని ఈ 36 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ దాదాపు రూ. 3,600 కోట్లు ఉంటుందని అంచనా.

హైకోర్టు తీర్పుతోనే కూల్చివేతలు

కొం­డా­పూ­ర్ ఆర్టీఏ కా­ర్యా­ల­యా­ని­కి సమీ­పం­లో­ని సర్వే నం­బ­ర్ 59లో 36 ఎక­రాల ప్ర­భు­త్వ భూ­మి­ని కొంత మంది కబ్జా చే­శా­ర­ని హై­డ్రా తె­లి­పిం­ది. దీ­ని­పై గతం­లో రై­తు­ల­కు అను­కూ­లం­గా రం­గా­రె­డ్డి జి­ల్లా సి­వి­ల్ కో­ర్టు తీ­ర్పు ఇచ్చిం­ది. రం­గా­రె­డ్డి జి­ల్లా కో­ర్టు తీ­ర్పు­ను హై­కో­ర్టు­లో తె­లం­గాణ ప్ర­భు­త్వం సవా­ల్ చే­సిం­ది. దీం­తో ఉన్నత న్యా­య­స్థా­నం సర్కా­ర్ రే­వం­త్ సర్కా­ర్ కి అను­కూ­లం­గా తీ­ర్పు ఇచ్చిం­ది. ఆ 36 ఎక­రాల భూమి ప్ర­భు­త్వా­ని­దే అని తే­ల్చి చె­ప్పిం­ది. హై­కో­ర్టు తీ­ర్పు మే­ర­కు కొం­డా­పూ­ర్ లోని బి­క్ష­ప­తి నగర్ ప్ర­భు­త్వ భూ­మి­లో ఉన్న ఆక్ర­మ­ణల తొ­ల­గిం­పు­ను భారీ పో­లీ­స్ బం­దో­బ­స్తు మధ్య హై­డ్రా సి­బ్బం­ది చే­ప­ట్టిం­ది.

Tags

Next Story