ICFAI Students: తప్ప తాగి కార్ రేసింగ్... మహిళ మృతి..
మద్యం మత్తులో కార్ రేసింగ్ పెట్టుకున్న విద్యార్ధులు మహిళ మృతికి కారణమైన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఇక్ ఫై (ICFAI) బిజినెస్ స్కూల్ కు చెందిన ముగ్గురు విద్యార్ధులు తప్ప తాగి జాన్వాడ గ్రామ పరిధిలో కార్ రేసింగ్ కు ఉపక్రమించారు. అదే సమయంలో శాంతమ్మ(55), ఆమె భర్త నర్శింహులు(62) ద్విచక్ర వాహనంపై అటుగా వెళుతున్నారు. అయితే మితిమీరిన స్పీడ్ తో దూసుకువచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా ఇద్దరు కింద పడి తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే తమకేం జరిగిందో తెలుసుకునేలోగానే శాంతమ్మ మీదకు మరో కారు దూసుకువచ్చింది. మితిమీరిన వేగంతో ఆమెపై నుంచి దూసుకుపోవడంతో శాంతమ్మ అక్కడికక్కడే మరణించింది. పోలీసులు మాత్రం యువకులు మద్యం మత్తులో ఉన్నారా లేదా అన్న విషయంపై క్లారీటీ లేదని తెలిపారు. నిందితులపై సెక్షన్ 303A, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com