BRS నాయకుల ఇళ్లల్లో IT సోదాలు

హైదరాబాద్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సుమారు 50 ఐటీ బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్లో బీఆర్ఎస్కు చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అదే పార్టీకి చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొత్తపేటలో శేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లి సోదాలు చేస్తున్నారు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. పన్ను చెల్లింపులకు సబంధించి వివిధ పత్రాలను ఐటీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. మరోవైపు నగరంలోని వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com