IT RAIDS: దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడి

హైదరాబాద్ నగరంలో మంగళవారం ఐటీ సోదాలు కలకలం రేపాయి. నగరంలో మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. హైదరాబాద్లోని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం నగరంలో 8 ప్రాంతాల్లో ఐటీ అధికారులు 55 బృందాలతో దాడులు చేపట్టారు. జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఇంకా దీనిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఇటీవల దిల్ రాజు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విడుదలై రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా సాధించింది. ఇంతలోనే ఇలా ఐటీ రైడ్స్ జరగడం గమనార్హం.
పుష్ప 2 నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు
హైదరాబాద్లో ఐటీ అధికారులు పంజా విసిరారు. నగరవ్యాప్తంగా 65 బృందాలు... ఎనిమిది ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆ సంస్థ అధినేత నవీన్, సీఈవో చెర్రీ నివాసాలతో పాటు.. పలు కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com