Jagityal: కడుపులో క్లాత్.. వైద్యుల నిర్లక్ష్యం

X
By - Subba Reddy |18 April 2023 11:30 AM IST
జగిత్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది
జగిత్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన మహిళకు ఆపరేషన్ చేసి కడుపులోనే క్లాత్ వదిలేసారు వైద్యులు. 16 నెలల క్రితం డెలివరీ కోసం నవ్యశ్రీ అనే మహిళ ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. కడుపులో క్లాత్ పెట్టి వదిలేశారు. ఏడాది తర్వాత తీవ్ర కడుపు నొప్పి రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్నారు నవ్యశ్రీ. స్కానింగ్లో కడపులో బట్ట ఉన్నట్టు గుర్తించారు. వెంటనే నవ్యశ్రీని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ చేసి క్లాత్ను తొలగించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులపై బాధిత కుటుంబం తీవ్రంగా మండిపడుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com