JUBLEEHILLS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం

JUBLEEHILLS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
X
జూబ్లీహిల్స్ బై పోల్‌పై ఎన్నికల సంఘం దృష్టి... నోడల్ అధికారులను నియమిస్తూ ఆదేశాలు... జూబ్లీహిల్స్ సహా దేశవ్యాప్తంగా ఉప ఎన్నిక.... పోలింగ్ బూత్‌లు పెంచాలని ఇప్పటికే వినతి

జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­పై ఎన్ని­కల సంఘం దృ­ష్టి సా­రిం­చిం­ది. జూ­బ్లీ­హి­ల్స్ బై పోల్ ని­ర్వ­హ­ణ­కు నో­డ­ల్ అధి­కా­రు­ల­ను ని­య­మిం­చా­రు. ఎన్ని­కల కోసం ప్ర­త్యే­కం­గా నో­డ­ల్ అధి­కా­రు­ల­ను ని­య­మి­స్తూ ఎన్ని­కల అధి­కా­రి అర్వీ కర్ణ­ణ్ ఉత్త­ర్వు­లు జారీ చే­శా­రు. మరో­వై­పు తె­లం­గా­ణ­లో రా­జ­కీయ సమీ­క­ర­ణా­లు వే­గం­గా మా­రు­తు­న్నా­యి. బీసీ రి­జ­ర్వే­ష­న్ల ద్వా­రా ప్ర­త్య­ర్థి పా­ర్టీల పైన కాం­గ్రె­స్ పై చేయి సా­ధిం­చా­మ­నే అభి­ప్రా­యం­తో ఉంది. బీసీ రి­జ­ర్వే­ష­న్ల అమలు వి­ష­యం­లో తదు­ప­రి కా­ర్యా­చ­రణ పైన కస­ర­త్తు చే­స్తోం­ది. పథ­కాల అమలు వేగం పె­ర­గ­టం­తో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల పైన కీలక ని­ర్ణ­యా­ని­కి సి­ద్ద­మైం­ది. అదే సమ­యం­లో జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­ను కాం­గ్రె­స్ ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా తీ­సు­కుం­ది.జూ­బ్లీ­హి­ల్స్‌ ని­యో­జ­క­వ­ర్గం­లో మరో 79 పో­లిం­గ్‌ బూ­త్‌­లు పెం­చా­ల­ని కేం­ద్ర ఎన్ని­కల కమి­ష­న్‌­ను కో­రి­న­ట్లు డీ­ఎం­సీ రజి­నీ­కాం­త్‌ రె­డ్డి పే­ర్కొ­న్నా­రు. జీ­హె­చ్‌­ఎం­సీ సర్కి­ల్‌-19 కా­ర్యా­ల­యం­లో శని­వా­రం అన్ని రా­జ­కీయ పా­ర్టీల నా­య­కు­ల­తో ఆయన సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. ప్ర­స్తు­తం ఉన్న 329 పో­లిం­గ్‌ కేం­ద్రా­ల­ను పెం­చా­ల­నే ని­ర్ణ­యా­న్ని అన్ని పా­ర్టీ­లు అం­గీ­క­రిం­చా­య­న్నా­రు. ఓటరు జా­బి­తా, ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­కు సం­బం­ధిం­చిన వి­వ­రా­లు ఆం­గ్లం, తె­లు­గు­లో­నూ ప్ర­చు­రిం­చా­ల­ని సీ­పీ­ఎం నేత సా­యి­శే­ష­గి­రి­రా­వు కో­ర­గా..ఉన్న­తా­ధి­కా­రుల దృ­ష్టి­కి తీ­సు­కె­ళ్తా­మ­ని రజి­నీ­కాం­త్‌ తె­లి­పా­రు.

బీఆర్ఎస్ రెడీ.. ?

బీ­ఆ­ర్‌­ఎ­స్‌ బై పో­ల్‌ మూ­డ్‌­లో­కి వచ్చే­సిం­దా? అభ్య­ర్థుల ఎం­పి­క­పై కస­ర­త్తు మొ­ద­లు­పె­ట్టిం­దా? ఎప్పు­డు సై­ర­న్‌ మో­గి­నా మేము సై అంటూ సి­ద్ధ­మై­పో­తోం­దా? అంటే అవు­న­నే సమా­ధా­న­మే వస్తోం­ది. 2023 అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ బీ ఫా­మ్‌ మీద గె­లి­చి… తర్వాత కాం­గ్రె­స్‌­లో­కి జం­ప్‌ అయి­పో­యా­రు పది మంది ఎమ్మె­ల్యే­లు. వా­ళ్ళ మీద అన­ర్హత వేటు వే­యా­లం­టూ అసెం­బ్లీ స్పీ­క­ర్‌­ని కో­రిం­ది బీ­ఆ­ర్‌­ఎ­స్‌. ఆ పో­రా­టం­లో భా­గం­గా సు­ప్రీం కో­ర్ట్‌ దాకా వె­ళ్ళిం­ది. తా­జా­గా వచ్చిన తీ­ర్పు తమకు అను­కూ­లం­గా ఉన్న­ట్టు భా­వి­స్తు­న్నా­రు గు­లా­బీ నే­త­లు. పా­ర్టీ ఫి­రా­యిం­చిన ఎమ్మె­ల్యేల సం­గ­తి­ని మూడు నె­ల­ల్లో­గా తే­ల్చ­మ­ని స్పీ­క­ర్‌­కు సూ­చిం­చిం­ది సు­ప్రీ­మ్‌ కో­ర్ట్‌. అం­దు­లో భా­గం­గా కొం­ద­రు ఎమ్మె­ల్యే­ల­కు స్పీ­క­ర్ నో­టీ­సు­లు కూడా ఇచ్చి­న­ట్టు చె­బు­తు­న్నా­రు బీ­ఆ­ర్‌­ఎ­స్‌ లీ­డ­ర్స్‌. మరి కొంత మంది ఫి­రా­యిం­పు ఎమ్మె­ల్యే­లు కూడా త్వ­ర­లో నో­టీ­సు­లు అం­దు­కో­బో­తు­న్నా­రం­టూ ప్ర­చా­రం చే­స్తు­న్నా­రు. ఇదం­తా చూ­స్తుం­టే… వా­ళ్ళ మీద ఖచ్చి­తం­గా అన­ర్హత పడు­తుం­ద­ని కారు పా­ర్టీ గట్టి­గా నమ్ము­తు­న్న­ట్టుం­ద­ని అం­టు­న్నా­రు . అలా అయితే అన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Tags

Next Story