KA Paul: మోదీని చూసి కేసీఆర్కు ఎందుకంత భయం: కేఏ పాల్

X
By - Divya Reddy |3 July 2022 3:00 PM IST
KA Paul: తెలంగాణలో ఓట్ బ్యాంక్ లేని బీజేపీని, మోదీని చూసి.. ఎందుకు భయపడుతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు కేఏ పాల్.
KA Paul: తెలంగాణలో ఓట్ బ్యాంక్ లేని బీజేపీని, మోదీని చూసి.. ఎందుకు భయపడుతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు కేఏ పాల్. మోదీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు పలికిన టీఆర్ఎస్.. బీజేపీ ఫ్లెక్సీలు పెట్టుకుంటే మాత్రం ఎందుకు అంత గొడవ చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్సే మోదీకి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ చెప్పినన్ని మాయ మాటలు ప్రపంచంలో ఏ పార్టీ చెప్పలేదంటూ విరుచుకుపడ్డారు పాల్. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ అతలాకుతలం చేసిందని మండిపడ్డారు. ఇకపై ప్రజాశాంతి పార్టీ తరపున బై బై మోదీ, బై బై కేసీఆర్ స్లోగన్లను బలంగా ప్రజలోకి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com