Kamareddy : చేపల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

X
By - Vijayanand |7 April 2023 3:49 PM IST
చెరువులో చేపలు పట్టే హక్కు మాకు మాత్రమే ఉందంటూ ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చేపలు పట్టే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చెరువు వద్దే ముదిరాజ్, బెస్త కులాలు బాహబాహికి దిగాయి. చెరువులో చేపలు పట్టే హక్కు మాకు మాత్రమే ఉందంటూ ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడికి దిగారు. ఈ ఘర్షణలో సుమారు 20మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు వర్గాల ఘర్షణతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com