Telangana: కంటివెలుగు దేశంలోనే గొప్ప పథకం: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
By - Prasanna |8 Feb 2023 7:23 AM GMT
Telangana: అసెంబ్లీ ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు.
Telangana: అసెంబ్లీ ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. శిబిరాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
కంటి వెలుగు క్యాంప్లో కంటి పరీక్షలు చేయించుకున్నారు స్పీకర్. కంటివెలుగు దేశంలోనే గొప్ప పథకమని, ఈ కార్యక్రమంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలు కంటివెలుగును ఆదర్శంగా తీసుకుంటున్నాయని, దూర ప్రాంతాలకు వెళ్లలేక అనేక మంది కళ్లు పోగొట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని అన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలని స్పీకర్ కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com