Karimnagar: అమ్మానాన్న తిట్టారని ఉసురు తీసుకుంది...

X
By - Chitralekha |6 Feb 2023 5:26 PM IST
మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రుల మందలింపు; బాలిక ఆత్మహత్య...
తల్లిదండ్రులు మందలించిన కారణంగా నిండు ప్రాణాలను బలితీసుకుంది ఓ బాలిక. ఈ ఘటన కరీమ్ నగర్ జిల్లా జమ్మికుంటలో చోటుచేసుకుంది. స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న ఆరెల్లి జాగృతికి మార్కులు తక్కువ రావడంతో తల్లిదండ్రులు మందలించినట్లు తెలుస్తోంది. చిన్న విషయానికే మనసు విరిగి విపరీత చర్యకు ఉపక్రమించింది. తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com