KAVITHA: ఫోన్ ట్యాపింగ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

KAVITHA: ఫోన్ ట్యాపింగ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
X
ఇప్పుడు నేను స్వేచ్ఛా జీవిని: కవిత

బీ­ఆ­ర్ఎ­స్ హయాం­లో జరి­గిన ఫోన్ ట్యా­పిం­గ్ వ్య­వ­హా­రం­పై తె­లం­గాణ జా­గృ­తి అధ్య­క్షు­రా­లు కల్వ­కుం­ట్ల కవిత చలన వ్యా­ఖ్య­లు చే­శా­రు. తన భర్త ఫోన్ ట్యా­ప్ చే­శా­ర­ని, సొంత బావ ఫోన్ ను ఎవ­రై­నా ట్యా­ప్ చే­స్తా­రా అని ప్ర­శ్నిం­చా­రు. ఫోన్ ట్యా­పిం­గ్ వా­ర్త వి­న­గా­నే కడు­పు­లో దే­వి­న­ట్లైం­ద­ని సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. జా­గృ­తి జనం బాట కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా కరీం­న­గ­ర్‍లో మీ­డి­యా­తో చిట్ చాట్ ని­ర్వ­హిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా మా­ట్లా­డిన కవిత బీ­ఆ­ర్ఎ­స్‍లో చాలా అవ­మా­నా­లు జరి­గా­య­న్నా­రు. అన్యా­యం జరి­గి­తే భరిం­చే­దా­న్ని కానీ అవ­మా­నా­న్ని భరిం­చ­లే­కే ఆత్మ­గౌ­ర­వం కో­స­మే బయ­ట­కు వచ్చా­న­న్నా­రు. బీ­ఆ­ర్ఎ­స్ లో చాలా మంది నే­త­లు అసం­తృ­ప్తి­లో ఉన్నా­ర­ని నేను బీ­ఆ­ర్ఎ­స్ ను వీ­డాక ఆ పా­ర్టీ నే­త­లు నాకు టచ్ లోకి వచ్చా­ర­ని చె­ప్పా­రు. జనం­బా­ట­లో పాత బీ­ఆ­ర్ఎ­స్ క్యా­డ­ర్ నాతో మా­ట్లా­డు­తు­న్నా­ర­ని చె­ప్పా­రు.

"ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు"

కరీం­న­గ­ర్ జి­ల్లా పరి­ధి­లో జా­గృ­తి అధ్య­క్షు­రా­లు కవిత చే­ప­ట్టిన జా­గృ­తి జనం బాట పా­ద­యా­త్ర ఉత్సా­హం­గా కొ­న­సా­గు­తోం­ది. ప్ర­జల నుం­చి వి­శే­ష­మైన స్పం­దన వస్తోం­ద­ని కవిత పే­ర్కొ­న్నా­రు. “సా­మా­జిక తె­లం­గాణ ని­ర్మా­ణం కోసం అన్ని వర్గాల వా­రి­నీ కలు­పు­కొ­ని ముం­దు­కు సా­గు­తు­న్నాం. వి­ద్య, వై­ద్యం వంటి కీలక అం­శా­లు ఇంకా జనాల మధ్య లో­తు­గా చే­రా­ల్సి ఉంది,” అని కవిత తె­లి­పా­రు. సిం­గ­రే­ణి సం­స్థ­ను కా­పా­డ­డం­లో మాజీ సీఎం కే­సీ­ఆ­ర్ కీలక పా­త్ర పో­షిం­చా­ర­ని గు­ర్తు­చే­సిన ఆమె, ఆర్టీ­సీ వి­భా­గం­లో ఉన్న సమ­స్య­ల­పై వి­ప్ల­వా­త్మక ఆలో­చన అవ­స­ర­మ­ని సూ­చిం­చా­రు. “సా­మా­జిక తె­లం­గా­ణ­ను సా­కా­రం చే­య­డం మనం­ద­రి బా­ధ్యత,” అని అన్నా­రు. “తె­లు­గు భా­ష­కు ప్రా­చీన హోదా రా­వ­డా­ని­కి మనం అం­ద­రం కృషి చే­శాం. కానీ కరీం­న­గ­ర్ జి­ల్లా­లో రో­డ్ల పరి­స్థి­తి చాలా దయ­నీ­యం­గా ఉంది. కేం­ద్ర మం­త్రి బండి సం­జ­య్ గారు ఈ సమ­స్య­ల­పై దృ­ష్టి పె­ట్టా­లి,” అని వ్యా­ఖ్యా­నిం­చా­రు. పం­ట­న­ష్టం­తో ఇబ్బం­ది పడు­తు­న్న రై­తు­ల­కు ఎక­రా­కు రూ.50 వేల పరి­హా­రం ఇవ్వా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు.

Tags

Next Story