KAVITHA: పతాక స్థాయికి చేరిన 'వార్' సత్వ పోరు

KAVITHA: పతాక స్థాయికి చేరిన వార్ సత్వ పోరు
X
నన్ను ఓడించింది సొంత పార్టీ నేతలే.. నాకు కేసీఆర్‌ ఒక్కడే నాయకుడన్న కవిత

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మరో బాంబు పేల్చారు. పార్టీలో ఉన్న విభేదాలను మరోసారి బయటపెట్టారు. బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే కనీసం నిరసన కూడా తెలపలేదని ధ్వజమెత్తారు. మీడియాతో చిట్ చాట్ చేసిన కవిత... సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ నాయకత్వం తప్ప వేరే ఎవరి నాయకత్వం కూడా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. తాను లీకు వీరులు గురించి బయటపెట్టమంటే గ్రీకు వీరులు వచ్చి దాడి చేస్తున్నారని అన్నారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లడిస్తున్నాని ధ్వజమెత్తారు. నా జోలికొస్తే బాగోదని హెచ్చరించారు. కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని కొందరు చెప్పుకుంటున్నారని అన్నపైనే డెరెక్ట్ అటాక్ చేశారు. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు అని ప్రశ్నించారు. నా లేఖ లీక్ చేసిందెవరో చెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసనలు తెలపలేదన్నారు. ఇంకో నేతకు నోటీసులు ఇస్తే ఎందుకు హంగామా చేశారని ప్రశ్నించారు.

జైలులో ఉన్నప్పుడే...

బీఆర్‌ఎస్‌ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందని కవిత అన్నారు. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే తాను వ్యతిరేకించానని కవిత వెల్లడించారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతమని కవిత వెల్లడించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదన్న కవిత. తనను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వెల్లడించారు. కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ మాత్రమే తనకు నాయకుడని.. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. వెన్నుపోటు పొడవడం తనకు తెలీదన్నారు. తాను నేరుగానే పోరాడతానని... కొత్త పార్టీ అవసరం లేదన్నారు. " లేఖలో నేను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుందా? కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లు అయ్యారా? కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండలేను. నా తండ్రికి వందల లేఖలు రాశాను.. తప్పేంటి?సాధారణంగా కేసీఆర్‌ లేఖను చదివాక చింపుతారు. ఈసారి అలా చింపలేదు. కుట్ర ఎవరు చేశారో నాకు తెలియదు... బయటపెట్టాలని అంటున్నాను. లీకు వీరుడా.. లీకు వీరులా? అనేది తెలియాలి.” అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

రాజీనామా చేస్తా అంటే వద్దన్నారు

జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పానని కల్వకుంట్ల కవిత తెలిపారు. తన జోలికి వస్తే బాగుండదని....తనపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ సోషల్‌ మీడియాలో తనను టార్గెట్‌ చేశారన్న కవిత...తన లేఖ లీక్‌ చేసిందెవరో చెప్పాల్సిందే అని అన్నారు. కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదన్న కవిత.. ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా' అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ను నడిపించగలరా..?

కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు అని ప్రశ్నించారు. తాను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటానన్నారు. పార్టీచేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నానని, కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదని విమర్శించారు. తనను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు అని కవిత పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలతో BRSలో ప్రకంపనలు మొదలయ్యాయి. తనపై వస్తున్న ఆరోపణలపై ఆమె ఘాటుగా స్పందించారు. పరోక్షంగా కేటీఆర్‌‌ను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్వీట్లు చేస్తే సరిపోతుందా అని విరుచుకుపడ్డారు. దీంతో పార్టీ విచ్ఛిన్నానికి బీజం పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కవితపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలపై కేటీఆర్ స్పందించకపోవడంతో కవిత కేటీఆర్‌నే టార్గెట్ చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. "నా తండ్రిని, నా కుటుంబాన్ని వదిలి నేనెందుకు వెళ్తాను?నా కుటుంబానికి నన్ను దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది. దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలి. నన్ను, కేసీఆర్‌ను విడదీసే కుట్ర చేస్తున్నారు. నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయను.. కేసీఆర్‌ మాత్రమే నాకు నాయకుడు. దామోదర్‌రావు, గండ్ర మోహన్‌రావును ఎవరు పంపారో నాకు తెలియదు. వాళ్లిద్దరూ ఎవరికి దగ్గరో తెలుసు కదా! వేరే నేత అంశంలో స్పందించిన పార్టీ.. నా విషయంలో ఎందుకు స్పందించడం లేదు. “ అని కవిత అన్నారు.

Tags

Next Story