KCR : వారం రోజుల్లో జీవో రిలీజ్ చేస్తాము : సీఎం కేసీఆర్

X
By - Sai Gnan |17 Sept 2022 6:15 PM IST
KCR : హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు
KCR : హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు. కేంద్రానికి ఎన్నోసార్లు మొర పెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు. వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన జీవో రిలీజ్ చేస్తామన్నారు. మోదీ ఆ జీవోను గౌరవిస్తారో.. లేక దాన్నే ఉరి తాడుగా మార్చుకుంటారో నిర్ణయించుకోవాలన్నారు.
ఇక దళితబంధు తరహాలోనే గిరిజనులకు గిరజన బంధు పథకం తీసుకువస్తామన్నారు కేసీఆర్. పోడు భూముల సమస్య పరిష్కారం కాగానే గిరిజన బంధు స్కీంపై ఫోకస్ పెడతామన్నారు. భూమి లేని నిరుపేద గిరుజనులకు సాయం చేస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com