KCR: అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్

KCR: అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్
X
సాదర స్వాగతం పలికిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు... దిశా నిర్దేశం చేసిన కేసీఆర్

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. నందినగర్‌ నుంచి బయల్దేరిన కేసీఆర్ అసెంబ్లీకి చేరుకోగా ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాదరస్వాగతం పలికారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేసీఆర్‌ అసెంబ్లీ హాజరవుతుండడంతో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది.

కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వేతనం నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ ను కోరారు. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు పొందుతూ కేసీఆర్ శాసన సభకు రావడం లేదని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్.. మెదర్ జిల్లా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెల్చిన సంగతి తెలిసిందే.

కేసీఆర్‌కు తెలంగాణ నిరుద్యోగుల లేఖ

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌కు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ నిరుద్యోగ సమితి లేఖ రాసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించింది. అందుకే తమ (గ్రూప్ 1,2,3, పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు) తరపున అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై పోరాడాలని విజ్ఞప్తి చేసింది.

కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై చర్చించారు. అప్పుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. భారీగా అప్పులు చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదన్నారు. రైతు బంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని.. ప్రభుత్వం అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని కేసీఆర్..దిశా నిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌పై ప్రభుత్వ తప్పుడు నిందలను తిప్పి కొట్టాలని... రైతుల సమస్యలు, మంచినీటి కొరతపై సభలో పోరాడాలన్నారు.

Tags

Next Story