KCR : చెప్పులు మోసే వ్యక్తులు మనకు అవసరమా : కేసీఆర్

KCR : చెప్పులు మోసే వ్యక్తులు మనకు అవసరమా : కేసీఆర్
KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర బీజేపీపై నిప్పులు చెరిగారు

KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర బీజేపీపై నిప్పులు చెరిగారు. పెద్దపల్లి జిల్లాలో నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా తెలంగాణ అద్భుత ప్రగతిని చూస్తోందన్నారు. గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను మోదీ దగా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచుతుంటే.. బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని దోచుకుతింటున్నారని ఫైర్ అయ్యారు.

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన పరిణామాలపైనా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మతం పేరుతో బీజేపీ దేశంలో కొట్లాటలు పెడుతోందని.. చెప్పులు మోసే వెధవలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు.

ఇక ప్రధాని మోదీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. గోల్‌మాల్ ప్రధాని, కేంద్రం చెప్పేది పచ్చి అబద్దాలని ఆరోపించారు. సింగరేణి గనులను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రైతులకు మీటర్లు పెట్టాలంటున్న మోదీకే మనమంతా మీటర్ పెట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ పోయి రైతు ప్రభుత్వం రాబోతోందని.. 2024లో బీజేపీలోని భారత దేశాన్ని సృష్టించాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story