KCR: సారొస్తున్నాడు..

KCR: సారొస్తున్నాడు..
X
మరో ఉద్యమానికి సిద్ధమైన బీఆర్ఎస్... మళ్లీ రాజకీయంగా కేసీఆర్ యాక్టీవ్.. నేటి బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌కు కేసీఆర్..కారు గేరు మార్చనున్న గులాబీ బాస్

ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్‌­ఎ­స్ ఓటమి తర్వాత గు­లా­బీ బాస్, మాజీ సీఎం కే­సీ­ఆ­ర్ ఫాం­హౌ­స్‌­కే పరి­మి­త­మ­య్యా­రు. ఇటీ­వల జరి­గిన జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్నిక, స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు సం­బం­ధిం­చిన సమా­వే­శా­లు, పా­ర్టీ నే­త­ల­తో సమా­వే­శా­ల­ను కూడా అక్క­డి నుం­చే ని­ర్వ­హి­స్తూ వస్తు­న్నా­రు కే­సీ­ఆ­ర్. ఈ రెం­డే­ళ్ల­లో కే­సీ­ఆ­ర్ ప్ర­జ­ల­కు కని­పిం­చిం­ది చాలా అరు­ద­నే చె­ప్పు­కో­వా­లి. అయి­తే తె­లం­గాణ సా­గు­నీ­టి హక్కుల రక్షణ కోసం కే­సీ­ఆ­ర్ రం­గం­లో­కి ది­గ­ను­న్నా­రు.నేడు తె­లం­గాణ భవ­న్‌­కు బీ­ఆ­ర్‌­ఎ­స్ అధి­నేత రా­ను­న్నా­రు. కే­సీ­ఆ­ర్ అధ్య­క్ష­తన ఇవాళ మధ్యా­హ్నం 2 గం­ట­ల­కు బీ­ఆ­ర్ఎ­స్‌­ఎ­ల్పీ, రా­ష్ట్ర కా­ర్య­వ­ర్గ సం­యు­క్త సమా­వే­శం జరు­గ­నుం­ది. నదీ జలాల వి­ష­యం­లో కాం­గ్రె­స్ ప్ర­భు­త్వ ని­ర్ల­క్ష్యం­పై కే­సీ­ఆ­ర్ సమ­ర­శం­ఖం పూ­రిం­చ­ను­న్నా­రు. తె­లం­గాణ సా­గు­నీ­టి హక్కుల రక్షణ కోసం మరో ప్ర­జా ఉద్య­మం­పై మాజీ సీఎం ది­శా­ని­ర్దే­శం చే­య­ను­న్నా­రు. బీ­ఆ­ర్ఎ­స్ఎ­ల్పీ సమా­వే­శం తర్వాత కే­సీ­ఆ­ర్ మీ­డి­యా­తో మా­ట్లా­డే అవ­కా­శం ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది.

మార్చి నెలలో చివరిసారిగా....

మా­ర్చి నె­ల­లో చి­వ­రి­సా­రి­గా ఆయన పా­ర్టీ ఆఫీ­స్ తె­లం­గాణ భవన్ వచ్చా­రు. ఇక ప్రె­స్ మీట్ పె­ట్టి ఏడా­ది దా­టు­తుం­ది. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ఏర్ప­డ­గా­నే రెం­డే­ళ్లు సమయం ఇస్తా­నం­టూ చె­ప్పిన కే­సీ­ఆ­ర్, ఇప్పు­డు మళ్లీ రం­గం­లో­కి ది­గ­ను­న్న­ట్లు సం­కే­తా­లు ఇచ్చా­రు. ఇవాళ తె­లం­గాణ భవ­న్‌­లో నే­త­ల­తో సమా­వే­శం ఏర్పా­టు చే­శా­రు. పా­ల­మూ­రు ప్రా­జె­క్ట్ నీటి కే­టా­యిం­పు­ల­పై ఉద్య­మం చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. ఇం­దు­కో­సం గత రెం­డు రో­జు­లు­గా ఫామ్ హౌస్ లో నే­త­ల­తో చర్చ­లు జరు­పు­తు­న్నా­రు కే­సీ­ఆ­ర్. ఇప్ప­టి­కే కే­సీ­ఆ­ర్ బయ­ట­కు రా­వా­లి.. అసెం­బ్లీ­లో చర్చ­ల్లో పా­ల్గొ­నా­లి అంటూ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి పదే­ప­దే సె­టై­ర్లు వే­స్తు­న్నా­రు. పా­ల­మూ­రు నీటి కే­టా­యిం­పుల వి­ష­యం­లో­నూ కేం­ద్రా­ని­కి రెం­డు పా­ర్టీ­లు లేఖ రా­ద్దాం.. అసెం­బ్లీ­లో చర్చి­ద్దాం.. రమ్మం­టూ వె­ల్‌­క­మ్ కూడా చె­ప్పా­రు. ఇప్పు­డు కే­సీ­ఆ­ర్ ఎల్లుం­డి తె­లం­గాణ భవన్ సమా­వే­శం­లో ఎలాం­టి ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­రు..? నీటి వా­టాల వి­ష­యం­లో మరో ఉద్య­మా­ని­కి తెర తీ­స్తా­రా? అనే­ది ఆస­క్తి­గా మా­రిం­ది. మీ­టిం­గ్ తర్వాత ప్రె­స్ మీట్ పె­డ­తా­రా..? ప్రె­స్ మీట్ లో ఎలాం­టి మా­ట­లు మా­ట్లా­డ­తా­రు? ఎలాం­టి ప్ర­క­ట­న­లు చే­స్తా­ర­నే­ది కూడా వెరీ ఇం­ట్రె­స్టిం­గ్ గా కని­పి­స్తుం­ది. ఇక వీ­ట­న్ని­టి­తో పాటు రా­జ­కీయ అం­శా­లు మా­ట్లా­డా­ల్సి వస్తే, కవి­త­పై కూడా స్పం­ది­స్తా­ర­నే­ది పా­ర్టీ­లో చర్చ జరు­గు­తుం­ది. కాం­గ్రె­స్, బీ­జే­పీ­ల­ను తె­లం­గాణ సమా­జం ముం­దు దో­షి­గా ని­ల­బె­డ­తా­మ­ని బీ­ఆ­ర్‌­ఎ­స్ చె­బు­తోం­ది. మరో­వై­పు బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ ప్ర­క్షా­ళ­న­ల­పై­నా కే­సీ­ఆ­ర్ దృ­ష్టి సా­రిం­చా­రు.

రంగంలోకి కేసీఆర్..

భారత్ రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ (బీఆర్‌ఎస్‌ఎల్పీ) సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి, పార్టీ సంస్థాగత నిర్ణయాలు, కార్యచరణపై చర్చిస్తారు. అంతేకాకుండా రాబోయే ప్రజా ఉద్యమాలు, సాగునీటి హక్కుల విషయంలో బీఆర్‌ఎస్‌ వైఖరి ఏంటి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రైతుల నీటి హక్కులపై మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం గురించి బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

పో­ల­వ­రం - నల్ల­మల సా­గ­ర్ ప్రా­జె­క్ట్‌­ను ఏపీ ప్ర­భు­త్వం తెర మీ­ద­కు తీ­సు­కొ­చ్చిం­ది. దీ­ని­పై కూడా కేం­ద్ర ప్ర­భు­త్వా­ని­కి ఫి­ర్యా­దు చే­సేం­దు­కు తె­లం­గాణ ప్ర­భు­త్వం సి­ద్ధ­మ­వు­తోం­ది. ఇప్ప­టి­కే దీ­న్ని కేం­ద్రం దృ­ష్టి­కి తీ­సు­కె­ళ్లా­రు తె­లం­గాణ భారీ నీటి పా­రు­దల శాఖ మం­త్రి ఉత్త­మ్‌ కు­మా­ర్ రె­డ్డి. పో­ల­వ­రం - బన­క­చ­ర్ల ప్రా­జె­క్ట్ పే­రు­ను నల్ల­మల సా­గ­ర్‌ ప్రా­జె­క్ట్‌­గా మా­ర్చి ఏపీ ప్ర­భు­త్వం మళ్లీ అదే పని చే­స్తోం­ద­ని మం­త్రి కేం­ద్ర జల­శ­క్తి శా­ఖ­కు లేఖ రా­సిన వి­ష­యం తె­లి­సిం­దే. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం వై­ఖ­రి రా­ష్ట్రా­ని­కి తీ­వ్ర­మైన అన్యా­యం చే­య­డ­మే. తె­లం­గాణ రా­ష్ట్రా­ని­కి ము­ఖ్యం­గా పా­ల­మూ­రు రం­గా­రె­డ్డి నల్ల­గొండ ప్ర­జల రై­తాంగ ప్ర­యో­జ­నా­లు దె­బ్బ­తిం­టు­న్న నే­ప­థ్యం­లో, తె­లం­గాణ రా­ష్ట్రం నుం­చి ఎని­మి­ది మంది బీ­జే­పీ ఎం­పీ­లు ఉండి కూడా ఒక్క­రూ మా­ట్లా­డిన పా­పాన పో­వ­ట్లే­దు. ఇంకా చె­ప్పా­లం­టే.. బీ­జే­పీ­యే తె­లం­గాణ ప్ర­యో­జ­నా­ల­కు రై­తాంగ ప్ర­యో­జ­నా­ల­కు గండి కొ­డు­తు­న్న­ద­నే­ది స్ప­ష్ట­మ­వు­తుం­ది. తె­లం­గాణ రా­ష్ట్రా­ని­కి సా­గు­నీ­టి వి­ష­యం­లో కేం­ద్ర బీ­జే­పీ చే­స్తు­న్న అన్యా­యా­న్ని కానీ, కా­వే­రి నదుల అను­సం­ధా­నం పే­రు­తో ఆం­ధ్ర రా­ష్ట్ర జల­దో­పి­డి­కి సహ­క­రి­స్తు­న్న కేం­ద్ర వి­ధా­నా­న్ని ఎదు­ర్కో­వా­లం­టే.. తె­లం­గాణ సమా­జం మరొ­క­సా­రి ప్ర­త్య­క్ష పో­రా­టా­లే శర­ణ్యం అని పా­ర్టీ అధి­నేత కే­సీ­ఆ­ర్ భా­వి­స్తు­న్నా­రు’’ అని బీ­ఆ­ర్ఎ­స్ వర్గా­లు తె­లి­పా­యి.

Tags

Next Story