KCR: అసెంబ్లీ సమావేశాలకు గులాబీ దళపతి కేసీఆర్!

KCR: అసెంబ్లీ సమావేశాలకు గులాబీ దళపతి కేసీఆర్!
X
నేటి నుంచే తెలంగాణ శాసనసభ సమావేశాలు... హైదరాబాద్ చేసుకున్న మాజీ సీఎం కేసీఆర్... ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు కేసీఆర్

అసెం­బ్లీ­కి హా­జ­రు­కా­వా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత, ప్ర­తి­ప­క్ష నా­య­కు­డు కే­సీ­ఆ­ర్‌ ని­ర్ణ­యిం­చి­న­ట్లు సమా­చా­రం. నేటి నుం­చి ప్రా­రం­భ­మ­య్యే సమా­వే­శా­ల­కు తాను వస్తా­న­ని.. అధి­కార పక్షం ఎలాం­టి ఎజెం­డా­ను ఖరా­రు చే­స్తుం­దో చూసి ముం­దు­కు వె­ళ­దా­మ­ని పా­ర్టీ నే­త­ల­తో పే­ర్కొ­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ఈక్ర­మం­లో ఆది­వా­రం సా­యం­త్రం ఎర్ర­వ­ల్లి­లో­ని ఫాం­హౌ­స్‌ నుం­చి హై­ద­రా­బా­ద్‌ బం­జా­రా­హి­ల్స్‌­లో­ని తన ని­వా­సా­ని­కి చే­రు­కు­న్నా­రు. పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి ప్రా­జె­క్టు అం­శం­పై అటు అసెం­బ్లీ సమా­వే­శా­ల్లో, ఆ తర్వాత క్షే­త్ర­స్థా­యి­లో బలం­గా పో­రా­టం చే­స్తా­మ­ని కే­సీ­ఆ­ర్‌ ఇప్ప­టి­కే ప్ర­క­టిం­చా­రు. కే­సీ­ఆ­ర్‌ ఇటీ­వల మీ­డి­యా సమా­వే­శం­లో కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వం­పై చే­సిన వి­మ­ర్శ­ల­కు ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి కూడా దీ­టు­గా బదు­లి­చ్చా­రు. తన­దైన శై­లి­లో వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. దీం­తో.. భారత రా­ష్ట్ర సమి­తి, కాం­గ్రె­స్‌ పా­ర్టీల మధ్య మాటల యు­ద్ధం కొ­న­సా­గు­తోం­ది. ఈ నే­ప­థ్యం­లో సో­మ­వా­రం నుం­చి ప్రా­రం­భ­మ­య్యే అసెం­బ్లీ సమా­వే­శా­లు హా­ట్‌ హా­ట్‌­గా ఉండే అవ­కా­శ­ముం­ద­ని రా­జ­కీయ వర్గా­ల్లో చర్చ జరు­గు­తోం­ది. కే­సీ­ఆ­ర్ అసెం­బ్లీ సమా­వే­శా­ల­కు హా­జ­ర­వు­తా­ర­న్న సమా­చా­రం రా­జ­కీయ వర్గా­ల్లో ప్రా­ధా­న్యత సం­త­రిం­చు­కుం­ది. కొ­న్ని రో­జుల క్రి­తం కే­సీ­ఆ­ర్ ప్రె­స్ మీట్ ని­ర్వ­హిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. ఈ సం­ద­ర్భం­గా కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. కే­సీ­ఆ­ర్ చే­సిన వ్యా­ఖ్య­ల­పై అధి­కార పక్ష్యం ప్ర­తి వి­మ­ర్శ­లు గు­ప్పిం­చిం­ది. అప్ప­టి నుం­చి కాం­గ్రె­స్, బీ­ఆ­ర్ఎ­స్ మధ్య మాటల యు­ద్ధం కొ­న­సా­గు­తోం­ది.

అసెంబ్లీలో హోరాహోరీ తప్పదు

పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విష‌యంలో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతున్నా రేవంత్‌రెడ్డి స‌ర్కార్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కేసీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడి, తెలంగాణ‌కు జ‌లాల విష‌యంలో ద్రోహం త‌ల‌పెట్టినా, రేవంత్‌రెడ్డి ఉలుకుప‌లుకు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌కు తాగునీళ్ల విష‌యంలో జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించి, ఉద్య‌మాన్ని నిర్మిస్తాన‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌పై సీఎం రేవంత్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ద‌మ్ముంటే అసెంబ్లీకి వ‌చ్చి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ గౌర‌వానికి త‌న‌ది పూచీ అని రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీకి వెళ్లాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ‌కు తాగునీళ్ల విష‌య‌మై స‌భ‌లో కేసీఆర్ నిల‌దీసే అవ‌కాశం వుంది. అయితే ఎన్నిరోజులు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తార‌నే అంశంపై స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న ఆధార‌ప‌డి వుంటుంది. అసెంబ్లీకి కేసీఆర్ వెళితే, స‌భ హాట్‌హాట్‌గా సాగే అవ‌కాశం వుంది. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటే చర్చ హోరాహోరీగా సాగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్-రేవంత్ మాటల యుద్ధం ఎలా సాగుతుందో చూడాలి.

Tags

Next Story