దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష

దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష
KCR: కరీంనగర్‌ కలెక్టరేట్‌లో దళితబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

KCR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు ప్రథకంపై సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హరీశ్​రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు హాజరయ్యారు. హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పథకం అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. పథకం అమలుపై అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

అటు దళిత బంధు పథకానికి అధికారులు సర్వే ప్రారంభించారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడంతో 290 మంది అధికారులతో పాటు బ్యాంక్ సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు కలెక్టర్ ఖాతాలో జమచేసింది. ఈ నేపథ్యంలో దళితబంధుపై సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story