పార్టీ ఎంపీలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

X
By - Nagesh Swarna |10 Sept 2020 6:54 AM IST
పార్టీ ఎంపీలతో తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు. ఈనెల 14నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, ఇటీవల ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com