KCR: మేము రూ.3 లక్షలు ఇస్తాం.. మీరు రూ.25 లక్షలు ఇవ్వండి.. మోదీకి కేసీఆర్ డిమాండ్..

X
KCR (tv5news.in)
By - Divya Reddy |20 Nov 2021 7:35 PM IST
KCR: మేం ధర్నా చేసిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు.
KCR: ఈరోజు (శనివారం) జరిగిన ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడిన పాయింట్స్ ఇవే..
- మేం ధర్నా చేసిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు.
- చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీ వెళ్తున్నాం.
- అవసరమైతే ప్రధానిని కూడా కలిసి డిమాండ్ చేద్దామనుకున్నాం.
- ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు కన్ఫ్యూజన్లో ఉంటారు.
- అనవసరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
- ముందే చేప్తే వేరే పంట వేసుకునే వాళ్లం కదా అని రైతులంటారు.
- మొన్న వాళ్లిచ్చిన స్టేట్మెంట్ నిజమా అబద్ధమా తెలియదు.. గాలి వార్తయితే వచ్చింది.
- వార్త నిజమా కాదా అనేది తేల్చుకునేందుకే ఢిల్లీ వెళ్తున్నాం.
- ఢిల్లీలో సమావేశం తర్వాత రైతులకు వివరాలు వెల్లడిస్తాం.
- ప్రకృతి కలిగించిన ఇబ్బందులు తట్టుకుని రైతులు అద్భుతమైన విజయం సాధించారు.
- రైతుల మీద పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి.
- దిశ అనే అమ్మాయి సంఘీభావం తెలిపితే ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు.
- ఇలాంటి కేసులన్నీ తక్షణమే ఎత్తివేయాలని ప్రధానిని డిమాండ్ చేస్తున్నాం.
- పోరాటంలో 750 మంది వరకు రైతులు ఆత్మార్పణం చేసుకున్నారు.
- చనిపోయిన వారందరికీ సంఘీభావం ప్రకటిస్తున్నాం.
- రైతు ఆందోళనలో చనిపోయిన వారందరికీ రూ.3 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాం.
- అవసరమైతే నేను కూడా వెళ్లి రైతు కుటుంబాలను పరామర్శిస్తా.
- ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలు పెట్టినా తట్టుకుని పోరాడారు.
- సారీ చెప్పి కేంద్రం చేతులు దులుపుకోవద్దు.. రూ.25 లక్షలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి.
- కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.
- రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీని కోసం పోరాడతాం.
- వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలి.
- కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం.
- కరోనాపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్లోనూ ప్రధానితో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పా.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com