ఈ చట్టంతో.. అంగుళం భూమి కూడా ఇతరులు ఆక్రమించలేరు : కేటీఆర్
By - Nagesh Swarna |26 Sep 2020 12:40 PM GMT
కొత్త రెవెన్యూ చట్టంతో... భూ సమస్యలపై ఆఫీసుల చుట్టు తిరగాల్సిన దుస్థితి తప్పుతుందన్నారు కేటీఆర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని రెవెన్యూ అంశాలు, సమస్యలపై మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికులు చెప్పిన సమస్యలన్నింటి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఇకకొత్త రెవెన్యూ చట్టంతో... భూ సమస్యలపై ఆఫీసుల చుట్టు తిరగాల్సిన దుస్థితి తప్పుతుందన్నారు. ధరణి పోర్టల్తో ఎలాంటి లొసుగులకు తావు లేకుండా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టంతో.. అంగుళం భూమి కూడా ఇతరులు ఆక్రమించలేరన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com