Khammam : ధాన్యం బస్తాలతో రాస్తారోకో

X
By - Vijayanand |17 May 2023 4:12 PM IST
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం-వరంగల్ రహదారిపై ధాన్యం బస్తాలతో రాస్తారోకో నిర్వహించారు. దాంతో వాహనాలు భారీగా నిలిచిపోయియి. ప్రభుత్వం, అధికారులపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రతి గింజను కొంటామని చెప్తున్న ప్రభుత్వం.. ఇపుడెందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com