Khammam: బొగ్గు లోడింగ్‌ పాయింట్‌ వద్ద ఉద్రిక్తత.. రైల్వే ట్రాక్‌పై ఆందోళన

Khammam: బొగ్గు లోడింగ్‌ పాయింట్‌ వద్ద ఉద్రిక్తత.. రైల్వే ట్రాక్‌పై ఆందోళన

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామ సమీపంలో బొగ్గు లోడింగ్‌ పాయింట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బొగ్గు లోడ్‌ చేసే సమయంలో డస్ట్‌ వెలువడుతోందని.. దానిని నివారించకుండా అలసత్వం వహిస్తున్నారంటూ సింగరేణి అధికారుల వైఖరిని నిరరిస్తూ రైల్వే ట్రాక్‌పై ఆందోళన చేపట్టారు. రైల్వే ట్రాక్‌పై నిరసన తెలుపుతున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు-ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బొగ్గు లోడింగ్ పాయింట్‌ నుంచి బొగ్గును లోడ్‌ చేసే సమయంలో విపరీతంగా దుమ్ము, ధూళి వెలువడుతోందని గతంలో పలుమార్లు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దుమ్ము కారణంగా అనారోగ్యానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story