KISHAN REDDY: మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు

KISHAN REDDY: మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు
ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. మహాజాతరపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని స్పష్టీకరణ

జాతీయ పండుగ అనే విధానం దేశంలో ఎక్కడా లేదని, మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మహాజాతరపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. మేడారంలో సారలమ్మను దర్శించుకున్న కిషన్ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. రేపు చాలామంది కేంద్రమంత్రులు అమ్మవార్ల దర్శనానికి వస్తారని చెప్పారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని, అందులో ఈ ఏడాది నుంచే.... ప్రవేశాలకు అనుమతిస్తామని వెల్లడించారు. వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తామని వివరించారు.


మరోవైపు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఉద్దేశించి...... విమర్శలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై TPCC కార్యనిర్వాహక అధ్యకుడు జగ్గారెడ్డి.......... తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడే ముందు.... భాజపా ఇచ్చిన హామీలపై ఎందుకు ఆలోచించరని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని....... ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. భారాస అధినేత KCR ప్యాకేజీలో భాగంగానే.......... కిషన్ రెడ్డి భాజపా తెలంగాణ అధ్యక్షుడు అయ్యారని జగ్గారెడ్డి... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భాజపాకు నిద్రపట్టడం లేదన్నారు.


తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరలో కీలకఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఈ సాయంత్రం చిలకలగుట్ట వద్ద... ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు కుంకుమభరిణే రూపంలో ఉన్న సమ్మక్క అమ్మవారిని కిందకు తీసుకొచ్చారు. సమ్మక్క ఆగమనానికి సూచనగాములుగు ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలికారు. కుంకుమభరిణే రూపంలో ఉన్న సమ్మక్క అమ్మవారిని తీసుకొని, పూజారులు మేడారం గద్దెల వైపు బయలుదేరారు. కాసేపట్లో గిరిజన సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, జంపన్నలను గద్దెలపై ప్రతిష్టించారు. సమ్మక్క రాకతో వనదేవతలంతా గద్దెలపై కొలువుదీరి భక్తకోటికి దర్శనమిస్తున్నారు. వనదేవతల దర్శనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు చత్తీస్ గడ్, మహారాష్ట్ర నుంచి జనం తరలిరావడంతో మేడారం జనసంద్రాన్ని తలపిస్తోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు, అనంతరం అమ్మవార్లకు బంగారం మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో జనజాతర మేడారం పులకించిపోతోంది. అశేష జనవాహినితో కీకారణ్యం కొత్త శోభను సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు భక్తులకు అభయమిస్తున్నారు. కోట్లాది భక్తుల ఇలవేల్పులకు పసుపు, కుంకుమ, నిలువెత్తు బంగారాలు సమర్పిస్తున్నారు. అశేష జనవాహినికి అభయమిచ్చేందుకు సమ్మక్క తల్లీ గద్దెలపై కొలువుదీరనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story