తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు మంత్రి హామీ ఇచ్చారు : కిషన్రెడ్డి

తెలంగాణలో ఎరువుల కొరతతో అక్కడక్కడ అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుంటున్నా.. ఎరువులు దొరకడం లేదని వాపోతున్నారు. ఐతే ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. రైతులకు సరిపడా ఎరువుల సరఫరాపై ఇప్పటికే తెలంగాణలోని వ్యవసాయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కిషన్రెడ్డి.. తాజాగా కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ్ను కలిశారు. తెలంగాణలో ఎరువుల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సరిపడా ఎరువుల సరఫరాకు సహకారం అందించాలని కోరారు. తన వినతిపై సదానందగౌడ్ సానుకూలంగా స్పందించారని కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ఎరువుల సరఫరాపై మంత్రిత్వ శాఖ పర్యవేక్షించి.. అవసరమైన యూరియాను అందిస్తామని హామీ ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com