Kishan Reddy : రామగుండం ఆసుపత్రికి అలాంటి భూమిని కేటాయిస్తారా : కిషన్ రెడ్డి

Kishan Reddy : రామగుండం ఆసుపత్రికి అలాంటి భూమిని కేటాయిస్తారా : కిషన్ రెడ్డి
X
Kishan Reddy : రామగుండంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూకేటాయింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

Kishan Reddy : రామగుండంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూకేటాయింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. రామగుండంలో వందపడకల ఆసుపత్రి కోసం భూమిని కేటాయించాలని గతంలో రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది కేంద్రప్రభుత్వం.అందుకు గాను రామగుండంలో శివార్లలో భూమిని కేటాయించింది రాష్ట్రప్రభుత్వం.

అయితే ఆభూమి గతంలో మున్సిపల్‌ డంపింగ్‌ యార్డ్‌ గా ఉపయోగించేవారని,దాని చుట్టుపక్కల రెండు స్మశాన వాటికలు ఉండి దారి కూడా లేదని భూమిని పరిశీలించిన కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. ఇదే విషయంపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. కార్మికుల రాకపోకలకు వీలుగా ఉండి ఆసుపత్రి నిర్మాణానికి అనువైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని లేఖలో కోరారు కిషన్‌ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు అందించిన నివేదికను కూడా ఈలేఖతో పాటు జోడించారు కేంద్ర మంత్రి.

Tags

Next Story