KTR: లోకేష్‌తో అర్ధరాత్రి కేటీఆర్ చర్చలు..!

KTR: లోకేష్‌తో అర్ధరాత్రి కేటీఆర్ చర్చలు..!
X
లోకేశ్‌, కేటీఆర్ మూడుసార్లు కలిశారన్న సీఎం రేవంత్.. చీకట్లో ఎందుకు కలిశారని సూటి ప్రశ్న

కే­సీ­ఆ­ర్ కు­టుం­బం­లో నా­య­క­త్వం­పై గొడవ జరు­గు­తుం­ద­ని.. కే­టీ­ఆ­ర్ కు ప్ర­తి­ప­క్ష హోదా ఇవ్వ­టా­ని­కి కే­సీ­ఆ­ర్ ఎం­దు­కు ఒప్పు­కో­వ­టం లే­ద­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ప్ర­శ్నిం­చా­రు. ఎమ్మె­ల్సీ కవి­త­కు.. ఆమె ఇం­ట్లో­నే వి­లువ లే­ద­ని.. చె­ల్లి కవి­త­నే కే­టీ­ఆ­ర్ నా­య­క­త్వా­న్ని ఒప్పు­కో­వ­టం లే­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­రు. కే­టీ­ఆ­ర్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­టో... స్లీ­పిం­గ్ ప్రె­సి­డెం­టో తనకు తె­లీ­ద­ని ఎద్దే­వా చే­శా­రు. కొం­ద­రు సూ­సై­డ­ల్ టెం­డె­న్స్ తో బా­ధ­ప­డు­తు­న్నా­రం­టూ రే­వం­త్ ఆస­క్తి­కర కా­మెం­ట్స్ చే­శా­రు. ఢి­ల్లీ­లో కేం­ద్ర మం­త్రు­ల­తో జరి­గిన సమా­వే­శాల అనం­త­రం మీ­డి­యా­తో చి­ట్‌­చా­ట్‌­లో సీఎం రే­వం­త్ రె­డ్డి ఈ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. పలు అం­శా­ల­పై స్ప­ష్టత ఇచ్చా­రు. తన పా­ల­న­పై వి­మ­ర్శ­లు చేసే ప్ర­త్య­ర్థు­ల­పై సూ­టి­గా వ్యా­ఖ్య­లు చే­శా­రు. ము­ఖ్యం­గా బీ­జే­పీ, బీ­ఆ­ర్‌­ఎ­స్ నే­త­ల­పై ఘా­టైన పద­జా­లం­తో ప్ర­స్తా­విం­చా­రు.

లోకేశ్‌తో రహస్య భేటీ

కేటీఆర్.. ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ను అర్థరాత్రి సమయంలో మూడు సార్లు ఎందుకు కలిశాడంటూ కేటీఆర్ ను రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటని.. అర్థరాత్రి లోకేష్ తో డిన్నర్ మీటింగ్ ఎందుకు అని.. లోకేష్ ను చీకట్లో కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వాళ్లలాగ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కే­సీ­ఆ­ర్ ను కా­పా­డేం­దు­కు కేం­ద్ర మం­త్రి కి­ష­న్ రె­డ్డి తా­ప­త్రయ పడు­తు­న్నా­ర­న్నా­రు. తె­లం­గాణ రా­ష్ట్ర ప్ర­యో­జ­నాల కోసం అధి­కా­రి­కం­గా పి­లి­స్తే కేం­ద్రం­తో చర్చిం­చ­టా­ని­కి.. సమీ­క్ష­ల­కు వె­ళ­తా­న­ని.. రా­ష్ట్ర భవి­ష్య­త్ కోసం కేం­ద్రం­తో కలి­సి పని చే­స్తా­మ­ని వి­వ­రిం­చా­రు.

కేంద్రంతో చర్చలు జరపకపోతే ఎలా..?

“కేం­ద్రం­తో చర్చ­లు జరు­ప­కుం­టే సమ­స్య­లు ఎలా పరి­ష్కా­రం అవు­తా­యి?” అని ప్ర­శ్నిం­చా­రు సీఎం. రా­ష్ట్రా­ని­కి సం­బం­ధిం­చి పలు ము­ఖ్య­మైన అం­శా­ల­ను ఢి­ల్లీ­లో కేం­ద్ర మం­త్రు­ల­తో చర్చిం­చా­మ­ని తె­లి­పా­రు. ఇం­డి­యా, పా­కి­స్తా­న్ మధ్యే నీటి పం­పి­ణీ­పై చర్చ­లు జరు­గు­తుం­టే, నేను పక్క రా­ష్ట్రం సీ­ఎం­తో మా­ట్లా­డి­తే తప్పేం­ట­ని ఆయన ప్ర­శ్నిం­చా­రు. బన­క­చ­ర్ల ప్రా­జె­క్టు­పై కేం­ద్ర జల­శ­క్తి శాఖ ఎలాం­టి చర్చ­లు జర­గ­లే­ద­ని ప్ర­క­టిం­చిం­ద­ని సీఎం తె­లి­పా­రు. అయి­తే, తాను ఇప్ప­టి­కే మూడు సమ­స్య­ల­ను పరి­ష్క­రిం­చా­న­ని పే­ర్కొ­న్నా­రు. “ప్ర­జ­లు నాకు అధి­కా­రం ఇచ్చా­రు.. రా­ష్ట్ర సమ­స్య­ల­ను కేం­ద్రా­ని­కి తీ­సు­కె­ళ్ల­డం నా బా­ధ్యత” అని సీఎం స్ప­ష్టం చే­శా­రు. ఢి­ల్లీ­కి కా­కుం­డా ఫామ్ హౌ­స్‌­కు వె­ళ్తే సమ­స్య­లు పరి­ష్కా­రం కావు అని పరో­క్షం­గా కే­సీ­ఆ­ర్‌­పై వి­మ­ర్శ­లు చే­శా­రు. నె­ల­కు ఖచ్చి­తం­గా రెం­డు సా­ర్లు ఢి­ల్లీ­కి వె­ళ్లి కేం­ద్ర మం­త్రు­ల­తో సమ­న్వ­యం చే­సు­కుం­టా­న­ని హామీ ఇచ్చా­రు. సమస్యలపై అధికారులు, సాంకేతిక నిపుణుల కమిటీ చర్చిస్తుందని వివరించారు. “నేను ఇంజనీర్‌ కాదు… సాంకేతిక అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటాం” అని పేర్కొన్నారు.

Tags

Next Story