KTR: దాడులు చేసుకోండని ఏ దేవుడు చెప్పాడు: కేటీఆర్
By - Divya Reddy |27 Aug 2022 11:51 AM GMT
KTR: అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చిన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR: అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చిన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం, కులం పేరుతో దాడులు చేసుకోండని ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు. ఎవరి అమ్మ గొప్ప అంటే ఏం చెబుతామన్నారు. దేశంలోని విద్యావిధానం, అభివృద్ధి గురించి ఆలోచించకుండా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పక్కదేశం చైనా అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.. మనం ఇక్కడ దేవుళ్ల కోసం కొట్టుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థుల కోసం స్టడీ మెటీరియల్ను అంబేద్కర్ యూనివర్సిటీ రూపొందించింది. ఈ స్టడీ మెటీరియల్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com