SIT: నేడు సిట్ విచారణకు కేటీఆర్

SIT: నేడు సిట్ విచారణకు కేటీఆర్
X
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించనున్న సిట్

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు పిలిచింది. గురువారం 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సిట్, ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తమ కార్యాలయానికి హాజరుకావాలని సూచించింది. ఈ మేరకు ఏసీపీ పి. వెంకటగిరి నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను విచారించిన సిట్, తాజాగా కేటీఆర్‌ను పిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసు దర్యాప్తునకు ఉపకరించే అంశాలపై ఆయన నుంచి వివరాలు సేకరించాల్సి ఉందని నోటీసుల్లో పేర్కొంది.

ఇప్పటికే హరీశ్‌రావుపై విచారణ

ఇదే కేసులో ఈ నెల 20న మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ అధికారులు విచారించారు. ఆ విచారణ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే కేటీఆర్‌కు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి చెందిన ఇద్దరు కీలక నేతలు వరుసగా సిట్ విచారణకు హాజరవడం, కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలతో 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లను అనధికారికంగా నిఘా పెట్టారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించారు. అప్పటి నుంచి సిట్ వివిధ దశల్లో సాక్ష్యాలు సేకరిస్తూ, పలు కీలక వ్యక్తులను విచారిస్తూ ముందుకు సాగుతోంది.

కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఫో­న్‌ ట్యా­పిం­గ్‌ వ్య­వ­హా­రం­లో సి­ట్‌ జారీ చే­సిన నో­టీ­సు­ల­పై బీ­ఆ­ర్ఎ­స్‌ వర్కిం­గ్‌ ప్రె­సి­డెం­ట్‌ కే­టీ­ఆ­ర్‌ తీ­వ్ర స్థా­యి­లో స్పం­దిం­చా­రు సి­రి­సి­ల్ల­లో మా­ట్లా­డిన ఆయన, రా­ష్ట్రం­లో జరు­గు­తు­న్న రా­జ­కీయ పరి­ణా­మా­ల­న్నీ ప్ర­జల దృ­ష్టి­ని మళ్లిం­చేం­దు­కే అని వి­మ­ర్శిం­చా­రు. ము­ఖ్యం­గా ఎన్ని­కల సమ­యం­లో ఇచ్చిన హా­మీల అమ­లు­లో ప్ర­భు­త్వం పూ­ర్తి­గా వి­ఫ­ల­మైం­ద­ని, ఆ వై­ఫ­ల్యా­న్ని కప్పి­పు­చ్చు­కో­వ­డా­ని­కి ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి వరు­స­గా డై­వ­ర్ష­న్‌ రా­జ­కీ­యా­లు చే­స్తు­న్నా­ర­ని ఆరో­పిం­చా­రు. సి­ట్‌ వ్య­వ­హా­రా­న్ని ప్ర­స్తా­వి­స్తూ, “ఇది అసలు స్వ­తం­త్ర దర్యా­ప్తు కాదు. ఇది రే­వం­త్‌­రె­డ్డి సి­ట్‌. ఆయన కూ­ర్చో­మం­టే కూ­ర్చుం­టుం­ది, ని­ల­బ­డ­మం­టే ని­ల­బ­డు­తుం­ది” అంటూ ఎద్దే­వా చే­శా­రు. గత కొం­త­కా­లం­గా ఏదో ఒక అం­శా­న్ని తె­ర­పై­కి తీ­సు­కొ­చ్చి కొ­న్ని రో­జు­లు హడా­వు­డి చేసి తర్వాత వది­లే­య­డం ప్ర­భు­త్వా­ని­కి అల­వా­టైం­ద­ని కే­టీ­ఆ­ర్‌ వ్యా­ఖ్యా­నిం­చా­రు. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు పే­రు­తో కొ­న్ని రో­జు­లు డ్రా­మా జరి­గిం­ద­ని, ఆ తర్వాత కా­ర్‌ రేసు అంశం, గొ­ర్రెల స్కా­మ్‌, ఇప్పు­డు ఫో­న్‌ ట్యా­పిం­గ్‌ అంటూ వరు­స­గా కథ­నా­లు మా­రు­తు­న్నా­య­ని అన్నా­రు. వీ­ట­న్నిం­టి­లో­నూ అసలు వి­ష­య­మే లే­ద­ని, కే­వ­లం రా­జ­కీయ లబ్ధి కో­స­మే ఈ ప్ర­య­త్నా­లు చే­స్తు­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. సిం­గ­రే­ణి కుం­భ­కో­ణా­న్ని బయ­ట­పె­ట్టిన కా­ర­ణం­గా­నే తనకు, హరీ­శ్‌­రా­వు­కు నో­టీ­సు­లు వచ్చా­య­ని కే­టీ­ఆ­ర్‌ ఆరో­పిం­చా­రు. ఉదయం ఒక స్కా­మ్‌ బయ­ట­పె­డి­తే, సా­యం­త్రా­ని­కి సి­ట్‌ నో­టీ­సు­లు అం­దు­తు­న్నా­యం­టే అది స్ప­ష్ట­మైన రా­జ­కీయ ప్ర­తీ­కా­ర­మే­న­ని అన్నా­రు.

Tags

Next Story