KTR Tweet: జహీరాబాద్‌లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ.. 1500ల మందికి ఉపాధి: కేటీఆర్ ట్వీట్

KTR Tweet: జహీరాబాద్‌లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ.. 1500ల మందికి ఉపాధి: కేటీఆర్ ట్వీట్
KTR Tweet: దేశంలోనే అతి పెద్ద ఐస్ క్రీమ్ కంపెనీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

KTR Tweet: దేశంలోనే అతి పెద్ద ఐస్ క్రీమ్ కంపెనీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హట్‌సన్ కంపెనీ ద్వారా రోజుకు 7 టన్నుల చాకోలెట్స్, 100 టన్నుల ఐస్‌క్రీంను ప్రాసెస్ చేసే ప్లాంట్ల ప్రారంభోత్సవం సంతోషాన్నిస్తుందన్నారు.

ప్రసిద్ధి చెందిన అరుణ్ ఐస్ క్రీమ్, ఐబాకో ప్లాంట్‌ను జహీరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇవాళ ఇండియాలో ఐస్‌క్రీమ్‌కు పుట్టినిల్లుగా జహీరాబాద్ నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి ఇది నిదర్శనమని ఆయన తెలిపారు.

ఈ యూనిట్ ఐస్ క్రీమ్ తయారీ నిమిత్తం రోజుకు 10 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేస్తుందని, దీనివల్ల పాడి రైతులు లాభం పొందుతారని పేర్కొన్నారు. 1500 మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story