Kushitha Kallapu Drugs Case: డ్రగ్స్ కేసుపై యూట్యూబర్ కుషిత సంచలన స్టేట్మెంట్..

Kushitha Kallapu (tv5news.in)
Kushitha Kallapu Drugs Case: బంజారాహిల్స్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పబ్లో మైనర్లకు కూడా మందు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించడం సంచలనంగా మారింది. టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించిన సమయంలో ఆరుగురు మైనర్లు పట్టుపడ్డారు. ఇందులో యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ కుషిత కల్లపు కూడా ఉంది. ఆమె వయసు ఆధార్లో డేటాఫ్ బర్త్ ప్రకారం చూస్తే.. 20 ఏళ్లు కూడా లేవు.
నిబంధనల ప్రకారం 21 సంవత్సరాలు నిండిన వారికే మద్యం సరఫరా చేయాలని తెలంగాణ ఆబ్కారీ శాఖ చెబుతోంది. దీంతో కుషితను కూడా పబ్లోకి అనుమతించారంటే నిబంధనలు ఎలా లైట్ తీసుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కుషిత ఓ వీడియోలో స్పందించింది. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాము వెళ్లిన పబ్లో డ్రగ్స్ సరఫరా జరిగితే.. అక్కడ ఉన్నవారు అందరూ డ్రగ్స్ తీసుకున్నట్టు కాదని కుషిత తెలిపింది. అందరూ అక్కడ ఉన్నవారందరూ డ్రగ్స్ తీసుకున్నారన్నట్టు మాట్లాడుతున్నారని.. అసలు విషయం తెలియాలంటే బ్లడ్ శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేసుకోమని పోలీసులకు విజ్ఞప్తి చేసింది కుషిత. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com