నా భర్త అందరికీ స్ఫూర్తి.. భావోద్వేగానికి గురైన సంతోషి!

గతేడాది వీరమరణం పొందిన కర్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు సేవలను స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆయన భార్య సంతోషిని సన్మానించారు.
ఈ సందర్భంగా సంతోషి మాట్లాడుతూ.... కేంద్రం అవార్డు ప్రకటించడం గర్వంగా ఉందని అన్నారు. దేశంకోసం ప్రాణాలర్పించిన తన భర్త ప్రజల్లో స్ఫూర్తి నింపుతారని, తన పిల్లలు వారి నాన్నను చూసి గర్విస్తున్నారని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, చైనా సైనికుల దాడిని వీరోచితంగా తిప్పికొడుతూ బిక్కుమళ్ల సంతోష్బాబు వీర మరణం పొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com