Liquor Case : నీతిమంతులైతే ఎందుకు గగ్గోలు : కిషన్ రెడ్డి

Liquor Case : నీతిమంతులైతే ఎందుకు గగ్గోలు : కిషన్ రెడ్డి
తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబమేనా అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి లిక్కర్‌ వ్యాపారం చేసింది, సెల్‌ఫోన్లు పగులగొట్టింది ఎవరో చెప్పాలన్నారు.

ఈడీ కేసు విషయంలో నీతిమంతులైతే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తప్పులు లేకుంటే నిజాయితీగా నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ సమాజం అంటే మీ కుటుంబమేనా అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి లిక్కర్‌ వ్యాపారం చేసింది.. సెల్‌ఫోన్లు పగులగొట్టింది.. అక్రమార్కులతో చేయి కలిపింది ఎవరో చెప్పాలని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈడీ కేసుతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. నోటీసులకే ఉలిక్కి పడితే ఎలా అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story