Liquor Scam : పిడికిలి బిగిస్తూ ఈడీ ఆఫీస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

Liquor Scam : పిడికిలి బిగిస్తూ ఈడీ ఆఫీస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
మంత్రి కేటీఆర్, హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు ఢిల్లీలో ఉన్నారు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఎదుట హాజరయ్యారు బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత. తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి కాన్వాయ్ లో ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు వెళ్లిన కవిత వెంట ఆమె భర్త అనిల్ ఉన్నారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తూ బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు పిడికిలెత్తి అభివాదం చేశారు.

కవిత వెంట ఆవిడ భర్త అనిల్, అడ్వకేట్లు ఉన్నారు. అయితే ఆఫీస్ లోపలికి కవితను మాత్రమే అనుమతించారు. లాయర్లు, కుటుంబ సభ్యులు బయటే ఉండిపోయారు. గురవారమే విచారణకు హాజరవ్వాల్సి ఉండగా 11వ తేదీన వస్తానని కవిత ఈడీని కోరింది. ఇందులో భాగంగానే కవిత ఈ రోజు ఈడీ ముందుకు హాజరైంది. మంత్రి కేటీఆర్, హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు ఢిల్లీలో ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఢిల్లీలో మకాం వేశారు.

Tags

Read MoreRead Less
Next Story